కవిత్రయం- Class 5th Telugu TLM- నన్నయ, తిక్కన , ఎర్రన- తెలుగు వినూత్న భోధనాభ్యసన పుస్తకం
Subject: Telugu (తెలుగు)
Class: 5th
Topic: కవిత్రయం (నన్నయ, తిక్కన , ఎర్రన)
“తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి” అనే సామెత విన్నారు కదా! మహాభారతాన్ని సంస్కృతంలో వేదవ్యాసుడు రాశాడు. నన్నయ్య, తిక్కన, ఎర్రాప్రగడలు మహాభారతాన్ని తెలుగులో రాశారు.
కవిత్రయం- Class 5th Telugu TLM- నన్నయ, తిక్కన , ఎర్రన- తెలుగు వినూత్న భోధనాభ్యసన పుస్తకం - AP BOARD TEXT BOOKS- TELUGU
ఈ ముగ్గురు రచయతలు గురించి సులభంగా, వినూత్నగా వివరించుటకు మరియు బోధించుటకు మహాభారత పుస్తక రూపంలో ఈ భోధనాభ్యసన పుస్తకం తయారు చేయడం జరిగింది. దీని ద్వారా విద్యార్దులకు మహాభారత రచయతులు నన్నయ, తిక్కన , ఎర్రన గురుంచి అర్ధవంతంగా వివరించవచ్చు.
కవిత్రయం:
1. నన్నయ్య:
నన్నయ్య రాజమహేంద్రవరంలో రాజరాజ నరేంద్రుని ఆస్థానంలో ఉండేవాడు. నన్నయ్య 11వ శతాబ్దనికి చెందినవాడు. ఆరాజు కోరికపై సంస్కృతంలో ఉన్న భారతాన్ని నన్నయ్య తెలుగులో రాశాడు. ఈయన ఆది, సభా పర్వాలను, ఆరణ్యపర్వంలో కొంత భాగాన్ని రాశాడు. నన్నయ్య ను ‘అదికవి’ అంటారు. ఈయనకు ‘వాగనుశాసనుడు’ అనే బిరుదు కూడా ఉంది.
Comments